ఉప్పుకి ఐశ్వర్యానికి సంబంధం

ఉప్పు కి.... ఐశ్వర్యానికి... సంబంధం

మహాలక్ష్మి దేవి క్షీర సాగరం నుండి అవతరించింది. సముద్రంలో ఉప్పు ఉంటుంది కనుక లక్ష్మీదేవికి ఉప్పు చాలా ఇష్టం.

చాలామంది బాధపడేది ఏమనగా ఎంత డబ్బు సంపాదించినా చేతిలో ధనం నిలబడడం లేదు అని,
ధనంనిలబడాలంటే ముందుగా ఒక కుండ తీసుకొని అందులో రాళ్ల ఉప్పు వేసి మొదటి తారీకు జీతమును అందులో ఒక రాత్రి ఉంచిన తరువాత దానిని ఖర్చు పెట్టుకోవడం గాని దాచుకోవడం కానీ చేయాలి. ఇలా చేయడం వలన డబ్బులు ఉన్న నెగటివ్ ఎనర్జీని ఉప్పు లాగేస్తుంది. ఈర్ష, అసూయ శక్తిని లాగేసే శక్తి ఉప్పుకుంటుంది.

మంగళవారం రాత్రి పూట ఉప్పు తీసుకుని ఎరుపు రంగు వస్త్రం లో మూట కట్టి ఇంటి ముందు తగిలించాలి. మరుసటి రోజు ఆ ఉప్పును ఏదైనా చెట్టు మొదలులో వేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది.

శుక్రవారం రోజున ఒక గాజు గ్లాసు తీసుకుని అందులో సముద్రపు ఉప్పును వేసి రెండు లవంగాలను కూడా వేసి ఇంటిలో ఒక మూలన పెట్టడం వలన ఇంటిలోని ఆర్థిక సమస్యలు తగ్గుతాయి.

లక్ష్మీ కటాక్షం కోసం సూర్యోదయానికి ముందుగా లేచి ఇంటి వెనుక గది తలుపులను తెరిచిన తరువాత మాత్రమే సింహద్వారం తెరవాలి. శుక్రవారం, మంగళ వారాలలో ఇంటికి వచ్చిన ముత్తైదువులకు పసుపు, కుంకుమ తాగేందుకు నీరు ఇవ్వాలి. పసుపు కొమ్ములను ముత్తైదువులకు ఇవ్వడం వలన జన్మలో చేసిన పాపాలు పోయి కుటుంబములో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి.

నేను ☝🏻
మీ ✍️

దేవెందర్ బండారి

No comments:

Post a Comment